Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7718 Registered: 03-2004 Posted From: 68.14.9.117
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 09, 2015 - 6:42 pm: | |
రంజాన్, పుష్కరాలకూ డబ్బుల కొరత అన్ని శాఖలకూ బిల్లుల నిలిపివేత మిషన్ కాకతీయ చెల్లింపులూ అంతే! 1260 కోట్ల కోసం కేంద్రానికి మొర ఫలించని సర్కారు ప్రయత్నాలు బాండ్ల అమ్మకంతో 1500 కోట్ల రుణ సేకరణకు నిర్ణయం హైదరాబాద్, జూలై 9: ధనిక రాష్ట్రం! యావత్ దేశంలో గుజరాత్ తర్వాత ఏకైక మిగులు రాష్ట్రం! కానీ... ఇప్పుడు తెలంగాణకూ ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఒకదాని తర్వాత ఒకటిగా చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణ ఖజానా బోసి పోయింది. పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే... ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన పుష్కర పనులకూ నిధుల్లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘రంజాన్ కానుక’లకూ సొమ్ముల్లేవు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నగదు నిల్వలు లేక బోరుమంటోంది. చివరికి... ఖర్చుల కోసం బాండ్లు జారీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. బ్రూవరేజెస్ కార్పొరేషన్ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రూ.1260 కోట్లను రిజర్వు బ్యాంకు చెప్పాపెట్టకుండా లాగేసుకోవడంతో తెలంగాణకు కష్టాలు తీవ్రమయ్యాయి. అంతకుముందే... రైతుల రుణమాఫీ కోసం రూ.2250 కోట్లు బ్యాంకులకు విడుదల చేయాల్సి వచ్చింది. దీనికి తోడు... నెలాఖరుకాగానే, ఉద్యోగుల జీతాల కోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది. దీంతో ఖజానా ఖాళీ అయిపోయింది. నగదు నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి. చివరాఖరికి... కోటి రూపాయలను విడుదల చేయాల్సి వచ్చినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్యమంత్రి అనుమతి తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖ అన్ని బిల్లుల చెల్లింపులను దాదాపుగా నిలిపివేసింది. ఉచిత విద్యుత్కు ఇవ్వాల్సిన నిధుల విడుదలను ఆపేసింది. రోడ్లు భవనాల శాఖకు చిల్లగవ్వ రాలడం లేదు. నీటిపారుదల శాఖలో పెద్దగా ఖర్చు లేనప్పటికీ... మిషన్ కాకతీయ బిల్లులను కూడా ఇవ్వడం లేదు. ఐటీ శాఖకు మళ్లించిన 1260 కోట్ల రూపాయలను అడ్వాన్సు రూపంలోనైనా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన విన్నపాన్ని కేంద్రం చెవికెక్కించుకోవడంలేదు. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రోజుకు ఐదారుసార్లు మాట్లాడి అలసిపోతున్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా కల్పించుకుంటున్నారు. అయినప్పటికీ... ‘చూద్దాం... చేద్దాం’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మాటలు మాత్రమే చెబుతున్నారు. బాండ్ల అమ్మకంద్వారా... ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు మరో మార్గం లేకపోవడంతో... సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి 1500 కోట్ల రుణం సేకరించాలని గురువారం తెలంగాణ ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు రిజర్వు బ్యాంకుకు విజ్ఞప్తిని పంపించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రెండుసార్లు సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా 3400 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ సేకరించింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,500 కోట్ల వరకు రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం సేకరించవచ్చు. ఇటీవల నగరానికి వచ్చిన నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడుని ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని 3.5 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఇందుకు... నీతీ ఆయోగ్ సరేనంటే, మరింత రుణం సేకరించవచ్చు |