ప్రభుత్వ కార్యాలయాలను ఆంద్రప్రదేశ్ తాత్కాలిక రాజదాని విజయవాడకు తరలించాలని ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. ఈ మేరకు శాఖాధిపతులకు ఆదేశాలు వెళ్లాయి.దీని ప్రకారం ఆయా శాఖల అదిపతులు తమ ఆపీస్ ల నిమిత్తం ఎంత స్పేస్ అవసరమో ప్రభుత్వానికి తెలియచేయవలసి ఉంటుంది. తదనుగుణంగా అక్కడ కేటాయింపులు చేస్తారు.ప్రజలకు సంబందించి అందుబాటులో ఉండవలసిన కార్యాలయాలను ముందుగా విజయవాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శాశ్వత రాజధాని నిర్మాణం చేపడతారు.కాగా కసరత్తు చేసిన తర్వాతే ముఖ్యమంత్రి రాజధానిపై ప్రకటన చేస్తారని ఆర్దిక మంత్రి యనమల చెప్పారు.